దిగొచ్చిన పాక్​ ప్రధాని షెహబాజ్​.. భారత్ తో శాంతి చర్చలకు రెడీ..

దిగొచ్చిన పాక్​ ప్రధాని షెహబాజ్​.. భారత్ తో శాంతి చర్చలకు రెడీ..

 పాకిస్తాన్​ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది.. పహల్గాంలో ఉగ్రమూకలు దాడి తరువాత .. భారత్​ ప్రతి చర్యకు పాక్​కు దిమ్మదిరిగి మైండ్​ బ్లాంక్​ అయింది.  ఇంతకాలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన  దాయాది దేశాధినేతలు... దిగి వచ్చారు.   విదేశాల్లో పర్యటిస్తున్నపాక్​ప్రధాని భారత్​ తో శాంతి చర్చలు జరిపేందుకు సిద్దంగా  పాక్​ ప్రధాని షెహబాజ్​ షరీఫ్ ప్రకటించారు.

ఇరాన్ లో  పర్యటిస్తున్న పాక్​ ప్రధాని షరీఫ్​.. మాట్లాడుతూ.. భారత్​ తో తాము శాంతి ఒప్పందాలు చేసుకునేందుకు సిద్దంగా ఉన్నమని ప్రకటించారు.  ఉగ్రవాద సమస్య.. జమ్మూకాశ్మీర్​.. సింధూ జలాల వివాదాలను పరిష్కరించుకునేందుకు చర్చించేందుకు రడీ గా ఉన్నామని ప్రకటించారు.  చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని తేల్చి చెప్పారు.  ఇండియాతో  తాము ఎప్పుడూ శాంతి కోసమేప్రయత్నాలు చేస్తున్నామని  పాక్​ ప్రధాని చెప్పుకొచ్చారు. భారత్ కూడా అదే కోరుకుంటే బావుంటుందని షరీఫ్ అన్నారు. 

ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్‌తో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) విషయంలో తప్ప ఏ విషయంలోనూ చర్చలు ఉండబోవని భారత్ తేల్చి చెప్పింది. .. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే పూర్తిగా ద్వైపాక్షికంగా ఉంటాయని.. ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైనే ఉంటుందని ఇప్పటికే భారత విదేశాంగ మంత్రి జైశంకర్​  తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ కూడా  సోమవారం ( మే 26)  గుజరాత్‌లో పర్యటిస్తూ.. పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ పౌరులు.. ప్రభుత్వ పెద్దలు శాంతిని కోరుకోకపోతే.. ఉగ్రవాదులను భారత్​పైకి ఉసిగల్పితే.. ఇండియన్​ ఆర్మీ తమ సత్తా ఏంటో చూపుతుందని చెప్పుకొచ్చారు. ప్రశాంతంగా జీవిస్తూ రోటీలు తినండి.. లేకపోతే బుల్లెట్​ దిగుతుందని  హెచ్చరించారు.  

అరకొరగా ఉన్న భారత్​ .. పాకిస్తాన్​ మధ్య సంబంధాలు పహల్గాం అటాక్​ తరువాత పూర్తిగా దెబ్బతిన్నాయి. పాక్​ పెంచి పోషిస్తున్న  ఉగ్రమూకల శిబిరాలను ఆపరేషన్​ సింధూర్​ పేరుతో ఇండియన్​ ఆర్మీ చిత్తు చిత్తు చేసింది.  తరువాత పాక్​ రెచ్చిపోయి  చేసిన దాడులను భారత్​ ఎక్కడికక్కడ తిప్పికొట్టింది.  పాక్​ఆర్మీ.. ఎయిర్​ బేస్​ లను నాశనం చేసిన భారత ఆర్మీ.. దాయాది దేశానికి గట్టిగా వార్నింగ్​ ఇచ్చింది.  దీంతో ఇప్పటివరకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన పాక్​ ప్రభుత్వ పెద్దలు కాళ్లబేరానికి వచ్చి..  భారత్​ తో శాంతి చర్చలు జరిపేందుకు సిద్దంగాఉన్నమని ప్రకటించారు. మరి ఈ విషయంలో ఎంత వరకు పాక్​ తన మాటకు కట్టుబడి ఉంటుందో చూడాలి. . .