
- ఇండియా దౌత్యపరంగా, సైనికపరంగా గెలిచిందని వ్యాఖ్య
వాషింగ్టన్: భారత్తో జరిగిన ఘర్షణలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయిందని, కుక్కలా తోకముడుచుకొని పారిపోయిందని అమెరికా మాజీ ఆర్మీ ఆఫీసర్ మైకెల్ రూబిన్ అన్నారు. టెర్రరిస్టుల క్యాంపులను ఇండియా ధ్వంసం చేసిందని యూఎస్ఆర్మీ హెడ్క్వార్టర్స్ పెంటగాన్ లో ఉన్నతాధికారిగా పనిచేసిన రూబిన్ పేర్కొన్నారు. తమ ఎయిర్బేస్లపై భారత్ దాడి చేయడంతో వణికిపోయిన పాక్.. సీజ్ఫైర్కోసం కోరిందని చెప్పారు.
ఈ ఘర్షణలో భారత్దౌత్యపరంగా, సైనికపరంగా గెలిచిందన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతిచ్చినట్లు ప్రపంచం దృష్టికి వచ్చిందన్నారు. మే 7న భారత్ నిర్వహించిన దాడుల్లో పాక్లోని టెర్రరిస్టు క్యాపుంలు ధ్వంసమయ్యాయని చెప్పారు. తర్వాత పాకిస్థాన్ చేసిన దాడులను భారత్ పూర్తిగా అడ్డుకుందని తెలిపారు. పాక్ ఎయిర్బేస్లను నిర్వీర్యం చేసిందన్నారు.