ప్రతి దాడి చేస్తాం: ఇండియాకు పాక్ ఆర్మీ వార్నింగ్

ప్రతి దాడి చేస్తాం: ఇండియాకు పాక్ ఆర్మీ వార్నింగ్

ఇస్లామాబా ద్: ‘‘యుద్ధం , బెదిరింపులు ఇండియా నుంచే వినిపిస్తున్నాయి. మా దేశం యుద్ధానికి ప్రిపేర్ అవడంలేదు. ఆత్మరక్షణ చర్యలు చేపడుతున్నాం. మాపై జరిగే ఎలాంటి దాడికైనా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం ” అని పాక్‌‌​ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గ ఫూర్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. పాక్ యుద్ధానికి సిద్ధమవుతున్నదని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇండియా దాడులకు పాల్పడి సర్ ప్రైజ్ చేయాలనుకుంటే.. ఆ తర్వాత మేమిచ్చే సర్ ప్రైజ్ మరోలా ఉంటుందని హెచ్చరించారు. పుల్వామా దాడి తర్వాత పాక్ పై కఠినంగా వ్యవహరించే దిశగా ఇండియా అడుగులు వేస్తున్న క్రమంలో పాక్ అప్రమత్తమయిం ది.