
ఇండియాతో చర్చలకు రెడీ అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తే ఇండియాతో చర్చలకు రెడీ అని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ‘కాశ్మీర్ డే’ సందర్భంగా పాక్లోని కోత్లీ జిల్లాలో శనివారం నిర్వహించిన పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ‘‘కాశ్మీర్ సమస్యను చర్చలతో పరిష్కరించుకోవడానికి రెడీ అని మేం ఇండియా ప్రధాని మోడీకి తెలియజేశాం. ఇది జరగాలంటే మీరు ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలి. యునైటెడ్ నేషన్స్ తీర్మానం ప్రకారం కాశ్మీరీలకు హక్కులను ఇవ్వాలి. దోస్తీ కోసం మేం చేస్తున్న ప్రయత్నాన్ని మోడీ ప్రభుత్వం మా బలహీనతగా పొరపడకూడదు”అని అన్నారు. కాశ్మీరీలకు సపోర్ట్ ఇవ్వడానికి ఏటా ఫిబ్రవరి ఐదున పాకిస్తాన్ ‘కాశ్మీర్ డే’ను పాటిస్తోంది. పాక్తో చర్చలకు ఇండియాకు ఏమాత్రం ఆసక్తి లేదని పుల్వామా ఘటన తరువాత తనకు అర్థమైందని అన్నారు.