
- పీటీఐ తరఫు లాయర్ను అడిగిన పాక్సుప్రీం కోర్టు
- పూర్తి వివరాలు ఇవ్వాలని ఏజీపీ ఆదేశాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుంచి తొలగించేందుకు విదేశీ శక్తలు కుట్రపన్నాయనే ఆరోపణలపై పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు పాక్ సుప్రీ కోర్టు చీఫ్ జస్టిస్ ఉమర్ అట బందియల్ అన్నారు. ఆదివారం ఇమ్రాన్ పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సురి తిరస్కరించడం... ఆ వెంటనే నిమిషాల వ్యవధిలో ఇమ్రాన్ పార్లమెంట్ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘‘ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని డిస్మిస్ చేసే అధికారం డిప్యూటీ స్పీకర్కు ఉందా? లేదా? పరిశీలిస్తం. ఇమ్రాన్పై విదేశీ కుట్రను కూడా తెలుసుకోవాలనుకుంటున్నం” అని సీజే అన్నారు. కుట్రకు సంబంధించి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్మీటింగ్లో చర్చ జరిగిందా? ఆధారాలు, వివరాలు ఉంటే కోర్టుకు సమర్పించాలని పాకిస్థాన్ తెహ్రీక్ఏ ఇన్సాఫ్(పీటీఐ) తరఫున వాదనలు వినిపిస్తున్న బాబర్ అవాన్ను అడిగింది. అలాగే అటార్ని జనరల్ఆఫ్ పాకిస్థాన్ను తన వాదనలు తరువాతి విచారణలో వినిపించాలని ఆదేశిస్తూ కేసును గురువారానికి వాయిదా వేశారు.
పాక్ వీడుతున్న ఇమ్రాన్ సన్నిహితులు
పాక్లో ఇమ్రాన్ ఖాన్ సర్కార్ సంక్షోభంలో పడడంతో ఆయన సన్నిహితులు దేశం విడిచి వెళ్తున్నారు. బుధవారం ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ స్నేహితురాలు ఫరాహ్ ఖాన్ పాక్ను వీడి దుబాయ్ వెళ్లారు. ఆ సమయంలో ఆమె చేతిలో 90 వేల డాలర్ల (రూ.68 లక్షలు) బ్యాగ్ ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ బ్యాగ్తో ఆమె విమానంలో ఉన్న ఫోటోలు సోషల్మీడిలో వైరల్ అయ్యాయి. ఇమ్రాన్ భార్యను అడ్డుపెట్టుకొని ఫరాహ్ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.