- మంత్రి ఉత్తమ్ను కోరిన పాలమూరు ఎమ్మెల్యేలు
- ప్రయారిటీ లిస్టులో ఉందన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: నారాయణపేట్– కొడంగల్లిఫ్ట్స్కీం ప్రాజెక్టు చేపట్టాలని పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కోరారు. సోమవారం సెక్రటేరియెట్లోని మంత్రి చాంబర్లో ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి మంత్రితో సమావేశమయ్యారు. 2014 మే 23న ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మహబూబ్నగర్జిల్లాలోని కరువు ప్రభావ ప్రాంతాలైన నారాయణపేట్, మక్తల్, కొడంగల్నియోజకవర్గాల్లోని 2.04 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు నారాయణపేట్– కొడంగల్లిఫ్ట్స్కీం సర్వే, ఇతర పనుల కోసం రూ.133.86 కోట్లు మంజూరు చేస్తూ జీవో 69 ఇచ్చిందని ఎమ్మెల్యేలు వివరించారు.
ఇందులో సర్వే కోసం రూ.3.36 కోట్లు, భూ సేకరణ కోసం రూ.130.50 కోట్లు ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని వివరించారు. ఈ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ప్రభుత్వం రద్దు చేసిందని, దీంతో కరువు ప్రభావ ప్రాంతాలకు తీరని నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నారాయణపేట్– కొడంగల్లిఫ్ట్స్కీం పనులు చేపట్టాలని, వచ్చే బడ్జెట్లోనే దీనికి నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రాధాన్యతగా పెట్టుకుందని, సీఎం రేవంత్రెడ్డి ఈమేరకు ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు.
పాలమూరును నాశనం చేశారు: యెన్నం
ఎక్కడో కరీంనగర్లో ఉన్న కేసీఆర్ను తీసుకువచ్చి పాలమూరు ఎంపీని చేస్తే సీఎం అయ్యాక ఆ జిల్లా రైతులను నాశనం చేశారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రితో సమావేశం తర్వాత సెక్రటేరియెట్ మీడియా సెంటర్లో ఆయన మాట్లాడారు. 2014లోపే ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాలో 70 శాతం ఇరిగేషన్ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయని, వాటిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు.
జూరాల నుంచి 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పాలమూరు ఎత్తిపోతలను పక్కన పెట్టి శ్రీశైలం నుంచి రూ.32 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారని, ఒక్క ఎకరానికి నీళ్లివ్వలేదన్నారు. రేవంత్ రెడ్డికి పేరు వస్తుందనే గత ప్రభుత్వం నారాయణపేట్– కొడంగల్ లిఫ్ట్ స్కీంను తొక్కి పెట్టిందని మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి అన్నారు. కోయిల్సాగర్ప్రాజెక్టు సామర్థ్యాన్ని మరో 2 టీఎంసీలకు పెంచాలని కోరామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. సాగునీటి సౌకర్యం లేకనే ప్రజలు ఇప్పటికీ వలస పోతున్నారని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.