యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ముగ్గురు విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. గతేడాది నవంబర్ 30న స్ఫూర్తి, రేవతి, హారిక అనే విద్యార్థినులు గౌస్ నగర్ నుంచి బండ సోమారం జిల్లా పరిషత్ హై స్కూల్కు నడుచుకుంటూ వెళ్తుండగా జిల్లా కలెక్టర్ మార్గమధ్యంలో వారిని గమనించారు. వారితో కాసేపు మాట్లాడారు. దాదాపు 3 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్న విద్యార్థినుల అవస్థ చూసి చలించిపోయిన కలెక్టర్ వారికి సైకిల్స్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం ముగ్గురు విద్యార్థినులకు కలెక్టరేట్లో సైకిళ్లను అందజేశారు. బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని ఆశీర్వదించారు.
మరిన్ని వార్తల కోసం..