
డబ్ల్యూహెచ్వో: కొత్త ఏడాదిలో కరోనాను ఓడిస్తామని నమ్మకం ఉందని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. వైరస్ మహమ్మారిపై పోరాడేందుకు ఇప్పుడు వ్యాక్సిన్లు సహా ఎన్నో ఆయుధాలు అందుబా టులోకి వచ్చాయని ఆయన చెప్పారు. ఈ ప్రయత్నంలో ప్రపంచ దేశాలన్నీ ఒక్కటిగా కలిసి నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశా రు. కొన్ని పేద దేశాలకు సరిపడా వ్యాక్సిన్లు అందకపోవడం వల్లే ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయని చెప్పారు. అందుకే వ్యాక్సిన్లు తయారు చేస్తున్న దేశా లు సంకుచిత భావం వదిలేయాలని, టీకాల పంపిణీలో అన్ని దేశాలకూ సమాన ప్రాధా న్యం దక్కాలని టెడ్రోస్ అన్నారు.