కోల్కతా: కొత్త కోఆపరేటివ్ పాలసీ రెడీ అయిందని, 47 మంది మెంబర్లతో కూడిన కమిటీ త్వరలో డ్రాఫ్టును కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుందని పానెల్ చైర్మన్ సురేష్ ప్రభు వెల్లడించారు. దేశంలో కోఆపరేటివ్ మూవ్మెంట్ను పటిష్టం చేసేందుకు ఒక కొత్త పాలసీ తేనున్నట్లు కిందటేడాదే కోఆపరేషన్ మినిస్టర్ అమిత్షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీకి సురేష్ ప్రభు నాయకత్వం వహించారు.
కోఆపరేటివ్ రంగంలోని నిపుణులు, ఆ రంగపు ప్రతినిధులతోపాటు, వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు పానెల్లో భాగంగా ఉన్నారు. పాలసీ డాక్యుమెంట్ దాదాపుగా పూర్తయిందని, ప్రభుత్వానికి అందచేయనున్నామని సురేష్ ప్రభు చెప్పారు. ఆ తర్వాత దీనిని అమలులోకి తెస్తారని పేర్కొన్నారు. మర్చంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సురేష్ ప్రభు పాల్గొన్నారు.