ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌ లో పుణెరి పల్టాన్‌‌‌‌ టాప్‌‌‌‌ షో

 ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌  లో పుణెరి పల్టాన్‌‌‌‌ టాప్‌‌‌‌ షో

చెన్నై :  ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌ (పీకేఎల్‌‌‌‌)లో పుణెరి పల్టాన్‌‌‌‌ టాప్‌‌‌‌ షో కొనసాగుతోంది. మంగళవారం జరిగిన ఏడో లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 46–28తో పట్నా పైరేట్స్‌‌‌‌ను ఓడించింది.  పుణె తరఫున పంకజ్‌‌‌‌ మోహితె (11), మోహిత్‌‌‌‌ గోయట్‌‌‌‌ (9), అస్లామ్‌‌‌‌ ముస్తఫా (6), మహ్మద్‌‌‌‌రెజా చియాన్‌‌‌‌ (6) రాణించారు. పట్నా టీమ్‌‌‌‌లో సచిన్‌‌‌‌ (8), సుధాకర్‌‌‌‌ (5), మంజీత్‌‌‌‌ (4) పోరాడి విఫలమయ్యారు. ఆట ఆరంభం నుంచి పంకజ్‌‌‌‌ రైడింగ్‌‌‌‌లో, అస్లామ్‌‌‌‌ ట్యాక్లింగ్‌‌‌‌లో ఆకట్టుకున్నారు. ఓవరాల్‌‌‌‌గా ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌‌‌‌ల్లో ఆరు విజయాలతో 31 పాయింట్లు సాధించిన పుణెరి టీమ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ టాపర్‌‌‌‌గా కొనసాగుతోంది.