పండుగకు పిల్లల్ని పంపాలని పేరెంట్స్ ధర్నా

పండుగకు పిల్లల్ని పంపాలని పేరెంట్స్ ధర్నా

సంగారెడ్డి : సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక గురుకుల బాలుర హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్రిస్మస్ పండుగకు విద్యార్థులను పంపేందుకు ప్రిన్సిపాల్ పాండు నాయక్ నిరాకరించారు. గేటుకు తాళం వేసి తల్లిదండ్రులు హాస్టల్ ఆవరణలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో తమ పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు ఆందోళనబాట పట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. 

క్రిస్మస్ సెలవులకు పిల్లలను పంపకపోవడంతో పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6గంటల నుంచి ఎదురుచూస్తున్న ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కనీసం పిల్లలతో మాట్లాడేందుకు సైతం అనుమతించడం లేదని వాపోతున్నారు.