- ఎంతో కొంత నేర్చుకుంటారనే ఆలోచనలో పేరెంట్స్
- లెర్నింగ్ గ్యాప్ పోగొట్టేందుకు ప్రయత్నం
- ప్రీ, ప్రైమరీ స్కూళ్లలో పెరిగిన అడ్మిషన్లు
హైదరాబాద్, వెలుగు: కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఆగమైన పిల్లల చదువులను గాడిలో పెట్టేందుకు పేరెంట్స్ప్రయత్నిస్తున్నారు. అప్పర్ ప్రైమరీ స్టూడెంట్స్ అప్పుడప్పుడు స్కూళ్లకు వెళ్లారు. లేదంటే ఆన్లైన్క్లాసులకు అటెండ్ అయ్యారు. కానీ ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్టూడెంట్స్ మాత్రం క్లాస్ రూమ్స్ ముఖమే చూడలేదు. కరోనా వేవ్స్వరుస పెట్టడంతో చాలా మంది తల్లిదండ్రులు భయంతో పిల్లలను ఇంటికే పరిమితం చేశారు. కొందరు ధైర్యం చేసి జాయిన్చేసినా కొద్ది రోజులకే బంద్ చేయించారు. ఇలా రెండేళ్లుగా ఇంట్లోనే ఏబీసీడీలు, నంబర్స్, రైమ్స్నేర్పించారు. ప్రస్తుతం థర్డ్వేవ్ ప్రభావం తగ్గిపోయిందని రాష్ట్ర వైద్య శాఖ ప్రకటించడంతో చిన్నారులను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు రెడీ అవుతున్నారు. అకడమిక్ఇయర్ఇంకో మూడు నెలలే ఉన్నప్పటికీ ఎంతో కొంత నేర్చుకుంటారని ఆలోచిస్తున్నారు. దగ్గరలోని స్కూళ్లకు కాల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. మంచిగా ఉందని అనిపిస్తే వెంటనే జాయిన్చేసేస్తున్నారు.
నేరుగా యూకేజీ, ఫస్ట్ క్లాస్
కొవిడ్ ఎంటర్ కాకముందు నర్సరీలో అడ్మిషన్ తీసుకున్న పిల్లలు ప్రస్తుతం యూకేజీకి వచ్చేశారు. కానీ రెండేళ్లలో వాళ్లు స్కూలుకి పోయింది లేదు. క్లాసులు విన్నదీ లేదు. కొన్ని కార్పొరేట్ స్కూళ్లు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు చెప్పినప్పటికీ అంతగా రీచ్ కాలేదు. ప్రస్తుతం కరోనా టెన్షన్ తగ్గడంతో తల్లిదండ్రులు మంచి స్కూళ్ల సెర్చింగ్లో పడ్డారు. రెండేళ్ల లెర్నింగ్ గ్యాప్ ని పోగొట్టేందుకు ఎంక్వైరీ చేస్తున్నారు. న్యూ అడ్మిషన్ తీసుకుని నేరుగా యూకేజీ, ఫస్ట్ క్లాసులో చేర్పించేస్తున్నారు. మాములుగా అడ్మిషన్లు ఓపెన్ చేయగానే రోజుకి రెండు, మూడు ఎంక్వైరీ కాల్స్ వచ్చేవని, ప్రస్తుత అకడమిక్ఇయర్కు ఇంకో మూడు నెలలే టైం ఉన్నా కొత్త అడ్మిషన్ల కోసం పేరెంట్స్ఎక్కువగా కాల్చేస్తున్నారని మేనేజ్మెంట్లు చెబుతున్నాయి. ‘రెండేళ్ల కింద మా బాబు/పాపను నర్సరీలో జాయిన్ చేశాం. కరోనా భయంతో ఇన్నాళ్లు ఇంట్లోనే ఉంచి బేసిక్స్ నేర్పించాం. ఇప్పుడు యూకేజీలో సీటు కావాలి. మళ్లీ ఫండమెంటల్స్ నుంచి నేర్పిస్తారా?’ అని అడుగుతున్నారని అంటున్నాయి. రెండేళ్లు గ్యాప్ రావడంతో ఉన్న మూడు నెలలను వేస్ట్చేయడం ఎందుకు అనే ఆలోచనలో పేరెంట్స్ఉన్నారు. దాదాపు 70 శాతం మంది పేరెంట్స్ పిల్లలను స్కూళ్లకు పంపించేదుకు ఇంట్రస్ట్గా ఉన్నారు.
మొన్ననే జాయిన్ చేసినం
మా బాబుకి మూడేళ్లు. గతేడాది ఓ ప్రీ ప్రైమరీ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాం. కొద్దిరోజులకే కొవిడ్ కేసులు పెరగడంతో మాన్పించేశాం. నేనే ఇంట్లో ఆల్ఫాబెట్స్, వర్డ్స్ నేర్పించా. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో 4 రోజుల కింద మా ఇంటికి దగ్గర్లోని స్కూల్ లో జాయిన్ చేశాం. యూకేజీలో అడ్మిషన్ తీసుకున్నాం.
- సోనీ ప్రియ, పేరెంట్, ఓయూ కాలనీ