నటుడు పరేశ్​ రావల్​ కు కరోనా..టీకా​ తీసుకున్న మూడు వారాల్లో

నటుడు పరేశ్​ రావల్​ కు కరోనా..టీకా​ తీసుకున్న మూడు వారాల్లో

బాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు పరేశ్ రావల్ కు కరోనా సోకింది. అయితే.. ఆయన కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాకూడా వైరస్ సోకింది. కరోనా వచ్చిందంటూ శుక్రవారం పరేశ్ రావల్ ట్వీట్ చేశారు. గత పది రోజుల్లో నన్ను కలిసిన వారు తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు పరేశ్ .

మార్చి 9నే పరేశ్ రావల్.. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. టీకా తీసుకున్న ఫొటోను కూడా ఆయన ట్వీట్ చేశారు. అయితే టీకా తీసుకుని మూడు వారాలు కాకముందే ఆయన కరోనా బారిన పడ్డారు.