పరిగి, వెలుగు: పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి పేలుడు సంభవించి ఒకరు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి ఫర్నేస్ (మెషీన్)పేలి అక్కడ పని చేస్తున్న ఆలీ, రషీద్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సోమాజిగూడలోని ప్రైవేట్దవాఖానకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆలీ చనిపోగా, రషీద్చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులు విచారణ జరిపి గురువారం ధర్మరాజ్, చందన్ రైపై కేసు నమోదు చేశారు. నిందితులు ప్రొసీజర్ ప్రకారం పని చేయకపోవడం వల్లే పేలుడు సంభవించిందని పరిగి ఎస్సై మోహన్ కృష్ణ తెలిపారు.
