పారిజాత పర్వం మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

పారిజాత పర్వం మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

చైతన్యరావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీషన్ లీడ్ రోల్స్‌‌‌‌లో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న చిత్రం ‘పారిజాత పర్వం’.  ఇప్పటికే విడుదలైన  ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ఇందులో  ఒక్కొక్కరి పాత్రను పరిచయం చేశారు. యాక్షన్, డ్రామా, ఫన్ సహా అన్ని ఎలిమెంట్స్‌‌‌‌తో కట్ చేసిన టీజర్ ఆసక్తికరంగా సాగింది. 

చివర్లో వైవా హర్ష చెప్పిన డైలాగ్ నవ్వులు పూయించింది.  చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ పాత్రల ప్రజెన్స్  ఇంట్రెస్టింగ్‌‌‌‌గా ఉంది. సునీల్ చేతిపై జై చిరంజీవ అనే టాటూ ఉండటం ఆకట్టుకుంది. ఇదొక హిలేరియస్ క్రైమ్ కామెడీ అని, మ్యూజిక్‌‌‌‌, విజువల్స్ అందర్నీ మెప్పిస్తాయని మేకర్స్ చెప్పారు.  ఏప్రిల్ 19న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.