సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’. ఈ మూవీ నుంచి బుధవారం మెలోడీ సాంగ్ను రిలీజ్ చేశారు. ‘పాడిందో కోయిల ఓ గీతం.. అదే నీ కన్నుల బాసలు తెలిపే సంగీతం.. బాగుంది సాగే ఈ పయనం.. ఇలా నా మనసుకు రెక్కలు తొడిగిన ఈ తరుణం’ అంటూ సాగిన పాటకు నాగవంశీ ట్యూన్ చేయగా, విజయేందర్ లిరిక్స్ రాశాడు.
హరి చరణ్ పాడాడు. ఇదొక ట్రావెల్ మ్యూజికల్ లవ్ స్టోరీ అని, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు.