డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ సమావేశాలు

డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ సమావేశాలు

న్యూఢిల్లీ, వెలుగు :  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 22 వరకు ఈ సమావేశాలు నిర్వహించను న్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ట్విట్టర్‌‌ లో పేర్కొన్నారు. మొత్తం 19 రోజుల పాటు జరగనున్న ఈ సెషన్‌లో 15 రోజు లు ఉభయ సభలు సమావేశం కానున్న ట్లు వెల్లడించారు.

ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌లకు బదులుగా ప్రతిపాదించిన బిల్లులపై ఈ సమావేశా ల్లో చర్చ జరగవచ్చని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల ఈ మూడు ముసాయిదా నివేదికలను హోంశాఖ స్టాండింగ్‌ కమిటీ ఆమోదించింది.