
కూకట్పల్లి, వెలుగు: పార్టీ పట్ల అంకితభావంతో, ప్రజల పట్ల సేవా దృక్పథంతో పని చేసినవారే కాంగ్రెస్లో నాయకులుగా ఎదుగుతారని ఏఐసీసీ అబ్జర్వర్అంజలి నిబంల్కర్అన్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే ఏ స్థాయి నాయకులకైనా పదవులు వస్తాయని తెలిపారు. మంగళవారం మూసాపేటలోని ఓ ఫంక్షన్హాల్లో పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జి, పీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్షుడి ఎన్నికకు ఏఐసీసీ ప్రతినిథిగా వచ్చి కార్యకర్తల అభిప్రాయం సేకరిస్తున్నట్లు చెప్పారు. జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామం, బూత్ స్థాయి వరకు కాంగ్రెస్కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
జిల్లా ప్రస్తుత అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. తనకు పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిరంతరం పని చేస్తానన్నారు. నాయకులు సత్యం శ్రీరంగం, పట్లోళ్ల నాగిరెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, తూము వేణు, బాలజీ, పుష్పారెడ్డి, శేరి సతీశ్రెడ్డి, తూము వినయ్కుమార్, లక్ష్మయ్య, గంధం రాజు తదితరులు పాల్గొన్నారు.