నారాయణపేట జిల్లా కోస్గి మండలం లోదీపూర్గ్రామానికి చెందిన నాలుగున్నరేళ్ల చిన్నారికి పట్టాదారు పాస్ బుక్ మంజూరైంది. ఏడాది క్రితం అమ్మానాన్నలను కోల్పోయిన చరణ్ నానమ్మ జానకమ్మ వద్ద ఉంటున్నాడు. అమ్మ లక్ష్మీ పేరుమీద ఉన్న 9 గుంటల భూమిని నానమ్మ సూచన మేరకు అధికారులు వల్పలి చరణ్ పేరుపై పట్టా చేశారు. బుధవారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చేతులమీదుగా పాస్బుక్ అందుకున్నాడు.