హైదరాబాద్లో నిమ్స్ ఎదురుగా ఉన్న బస్టాండ్లో సీట్లు.. ఎక్కడికి పోయినట్లు ?

హైదరాబాద్లో నిమ్స్ ఎదురుగా ఉన్న బస్టాండ్లో సీట్లు.. ఎక్కడికి పోయినట్లు ?

పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్​ వెళ్లే మార్గంలో నిమ్స్ ​ఎదురుగా ఉన్న బస్టాప్లో ప్రయాణికుల కుర్చీలు మాయమయ్యాయి. ఎర్రమంజిల్ రాక ముందు గోకుల్ ​టవర్స్ ముందు ఉండే ఈ బస్టాప్లో కూకట్​పల్లి, బాలానగర్, బోరబండ, అమీర్​పేట నుంచి ఎంజీబీఎస్, కోఠి, ఉప్పల్​వెళ్లే బస్సులు ఆగుతుంటాయి. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.

వారం నుంచి ఈ బస్టాప్లో కుర్చీలు లేకపోవడంతో ప్రయాణికులు నిలబడీ.. నిలబడీ ఫుట్​పాత్పై కూర్చుంటున్నారు. సరిగ్గా ఈ బస్టాప్​వెనకే కొద్ది రోజుల కింద ఓ బేకరీ, టీ స్టాల్తో పాటు చాట్​బండి ఏర్పాటు చేశారు. వీరి బిజినెస్​కు బస్టాప్, అందులోని​ కుర్చీలు అడ్డుగా ఉన్నాయనే తొలగించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఖైరతాబాద్ డిప్యూటీ కమిషనర్​ రజినీకాంత్​ రెడ్డిని వివరణ కోరగా కుర్చీలు మాయమైన ఘటన తన దృష్టికి రాలేదన్నారు.

వెలుగు, హైదరాబాద్​ సిటీ