
పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ వెళ్లే మార్గంలో నిమ్స్ ఎదురుగా ఉన్న బస్టాప్లో ప్రయాణికుల కుర్చీలు మాయమయ్యాయి. ఎర్రమంజిల్ రాక ముందు గోకుల్ టవర్స్ ముందు ఉండే ఈ బస్టాప్లో కూకట్పల్లి, బాలానగర్, బోరబండ, అమీర్పేట నుంచి ఎంజీబీఎస్, కోఠి, ఉప్పల్వెళ్లే బస్సులు ఆగుతుంటాయి. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.
వారం నుంచి ఈ బస్టాప్లో కుర్చీలు లేకపోవడంతో ప్రయాణికులు నిలబడీ.. నిలబడీ ఫుట్పాత్పై కూర్చుంటున్నారు. సరిగ్గా ఈ బస్టాప్వెనకే కొద్ది రోజుల కింద ఓ బేకరీ, టీ స్టాల్తో పాటు చాట్బండి ఏర్పాటు చేశారు. వీరి బిజినెస్కు బస్టాప్, అందులోని కుర్చీలు అడ్డుగా ఉన్నాయనే తొలగించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఖైరతాబాద్ డిప్యూటీ కమిషనర్ రజినీకాంత్ రెడ్డిని వివరణ కోరగా కుర్చీలు మాయమైన ఘటన తన దృష్టికి రాలేదన్నారు.
వెలుగు, హైదరాబాద్ సిటీ