- ప్రయాణికులే టార్గెట్గా చైన్ స్నాచింగ్.
- రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మాదాపూర్పోలీసులు
- 93 గ్రాముల బంగారు గొలుసులు స్వాధీనం.. 9 మంది నిందితుల అరెస్ట్
మాదాపూర్, వెలుగు: హైటెక్సిటీలో రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సుల్లో చైన్స్నాచింగ్కు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్పోలీసులు పట్టుకున్నారు. 9 మంది ముఠా సభ్యులను అరెస్ట్చేసి, రూ.6 లక్షల విలువైన 93 గ్రాముల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ఏడీసీపీ నర్సింహారెడ్డితో కలిసి గురువారం మాదాపూర్పీఎస్లో వివరాలు వెల్లడించారు. మల్లేపల్లి ప్రాంతానికి చెందిన నగేశ్, ధర్మేందర్, అనిల్, రాహుల్, హీరా, ప్రసాద్, లక్ష్మణ్, శ్రీనివాస్, రమేశ్ మల్లేపల్లి అఫ్జల్సాగర్కాలనీలో నివాసముంటూ కూలీ పనులు చేస్తున్నారు. డబ్బులు సరిపోకపోవడం, లగ్జరీ లైఫ్ను గడపాలని కోరిక ఉండడంతో అందరూ కలిసి చైన్స్నాచింగ్ లకు పాల్పడాలని డిసైడ్అయ్యారు. జూబ్లీహిల్స్–సైబర్టవర్స్రోడ్, మెహిదీపట్నం–లింగంపల్లి రూట్, కూకట్పల్లి రూట్లలో రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మగవారి మెడలోని చైన్లు కొట్టేసేందుకు ప్లాన్వేశారు.
బస్సులో తోపులాట సృష్టించి చోరీలు
10 నుంచి 15 మంది వరకు ఒక బ్యాచ్గా ఏర్పడి ఒకే బస్సు ఎక్కి బంగారు గొలుసు ధరించిన వ్యక్తిని టార్గెట్ చేసుకునేవారు. ప్రయాణికుడు బస్టాప్లో దిగే సమయంలో ఫుట్బోర్డు వద్ద తోపులాట చేస్తున్నట్లు చేసి అతడి మెడలోని చైన్ను ఒకరు కట్చేసి వెంటనే మరొకరికి ఇచ్చేవారు. ఆ చైన్తీసుకున్న వ్యక్తి వెంటనే బస్సు దిగి జారుకునేవాడు. ఆ ముఠా లీడర్నగేశ్ఆ చైన్ను అమ్మేసి వచ్చిన డబ్బును మిగిలిన వ్యక్తులకు తలా 1000, 2000 వేలు ఇచ్చేసి మిగతా డబ్బును తన వద్ద ఉంచుకునేవాడు. వీరంతా కలిసి మాదాపూర్పీఎస్లిమిట్స్ లో ఒక్క ఏప్రిల్నెలలోనే 9 చైన్స్నాచింగ్లకు పాల్పడ్డారు. జూబ్లీహిల్స్, హుమాయున్నగర్, రాయదుర్గం పోలీస్స్టేషన్ల లిమిల్స్లోనూ వీరు స్నాచింగ్కు చేశారు.
పరారీలో మరో నలుగురు
ఆర్టీసీ బస్సుల్లో ఒక్క నెలలో 9 చైన్స్నాచింగ్ కంప్లైంట్స్రావడంతో మాదాపూర్పోలీసులు ఈ కేసులపై సీరియస్గా దృష్టిపెట్టారు. బస్టాపుల్లో కాపుకాస్తూ, బస్సుల్లో ప్రయాణికుల్లా ట్రావెల్చేసి నిఘా పెట్టారు. గురువారం ఉదయం సీఓడీ జంక్షన్బస్టాప్వద్ద బస్సు ఫుట్బోర్డుపై ఓ ప్రయాణికుడి మెడలో నుంచి లక్ష్మణ్, శ్రీనివాస్గొలుసు స్నాచింగ్చేస్తూ మఫ్టీలో ఉన్న పోలీసులకు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా రత్నదీప్సూపర్మార్కెట్బస్టాప్వద్ద ఉన్న మిగతా సభ్యులను అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి 93 గ్రాముల 9 బంగారు గొలుసులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు నిందితులు మంగీత, అర్జున్, అనురాధ, కాజల్పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు నగేశ్పై హైదరాబాద్కమిషనరేట్పరిధిలో 3 స్నాచింగ్కేసులున్నాయి. ధర్మేందర్పై పలు చోట్ల 10, లక్ష్మణ్పై 13 స్నాచింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడినవారిని రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో ఏడీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రఘునందన్రావు, ఇన్స్పెక్టర్ తిరుపతి, డీఐ వెంకట్ పాల్గొన్నారు.