గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మహిపాల్​ రెడ్డి

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మహిపాల్​ రెడ్డి

పటాన్​చెరు/జిన్నారం, వెలుగు : గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్​చెరు, చిన్నారం మండలాల పరిధిలోని ఆయా గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. నందిగామ పాశమైలారం, బచ్చుగూడెంలలో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సీఎం కేసీఆర్ నాయకత్వంలో రహదారుల అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఎంపీడీవో బన్సీలాల్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.