![ఏప్రిల్ 6న పాటపై తూటా](https://static.v6velugu.com/uploads/2024/04/patapi-thuta-on-april-6_q0n2j5HJvP.jpg)
ఖైరతాబాద్, వెలుగు : గద్దర్ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘పాటపై తూటా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సీనియర్జర్నలిస్ట్పాశం యాదగిరి, నిర్వాహకుడు సూర్యకిరణ్తెలిపారు. సోమవారం ప్రెస్క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్పై కాల్పులు జరిగాయని గుర్తుచేశారు.
ఆ ఘటనను గుర్తుచేస్తూ యేటా ‘భావ ప్రకటన– పాలకుల అణిచివేత – గాయపడ్డ పాట’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని గద్దర్అభిమానులందరూ హాజరుకావాలని కోరారు. సమావేశంలో ప్రొఫెసర్ ప్రభంజన్యాదవ్, డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్యాదవ్, రఫీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు.