ఐసీయూలో పేషెంట్​ను కరిచిన ఎలుకలు

ఐసీయూలో పేషెంట్​ను కరిచిన ఎలుకలు

కామారెడ్డి, వెలుగు : ఐసీయూలో కోమాలో ఉన్న ఓ పేషెంట్ ఎలుకలు కొరికిన ఘటన కామారెడ్డి జిల్లా హాస్పిటల్ వెలుగుచూసింది. స్థానిక హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన షేక్​ముజీబ్​హైబీపీ కారణంగా కోమాలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు జిల్లా హాస్పిటల్​లో చేర్పించగా ప్రస్తుతం ఐసీయూలో ట్రీటెమెంట్ తీసుకుంటున్నాడు. శనివారం రాత్రి ఐసీయూలోకి చేరిన ఎలుకలు ముజీబ్​కాలు, చేతిని కొరికాయి.

అయితే ముజీబ్ కోమాలో ఉండడంతో ఎలుకలు కొరుతున్న విషయం తెలియలేదు. కొద్దిసేపటి తర్వాత ఐసీయూలోకి వచ్చిన స్టాఫ్ ఎలుకలు కరిచినట్లు గుర్తించి ట్రీట్​మెంట్​చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్​కుమార్​ఆదివారం హాస్పిటల్ కు వచ్చి ఐసీయూను పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. ఘటనపై పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. 

ఇద్దరు డాక్టర్లు, నర్స్ సస్పెన్షన్

హైదరాబాద్, వెలుగు : కామారెడ్డి హాస్పిటల్ ఐసీయూలో పేషెంట్‌‌‌‌ను ఎలుకలు కరిచిన ఘటనలో ఇద్దరు డాక్టర్లు, ఓ నర్స్‌‌‌‌ను వేటు పడింది. ఐసీయూ ఇన్ చార్జి కావ్య, ఐసీయూ జనరల్ మెడిసిన్ ఇన్‌‌‌‌చార్జ్ వసంత్ కుమార్, డ్యూటీ నర్స్ జి. మంజులను సస్పెండ్ చేస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ త్రివేణి ఆర్డర్స్ జారీ చేశారు.