సర్కార్ హాస్పిటల్స్ లో పేషెంట్ల కష్టాలు 

సర్కార్ హాస్పిటల్స్ లో పేషెంట్ల కష్టాలు 

రాష్ట్రంలోని సర్కార్  హాస్పిటల్స్ లో  పేషెంట్ల కష్టాలు ఎక్కువయ్యాయి. మెడికల్ ఎక్విప్మెంట్లు పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.  చాలా ఆస్పత్రుల్లో ఔట్ డేటెడ్ ఎక్విప్మెంట్ రన్ అవుతున్నాయి. కొత్త బిల్డింగ్స్ కడతామని.. పేదలకు మెరుగైన వైద్యం ఇస్తామని నేతలు చెబుతున్నా అది అమలు కావడం  లేదు. దీంతో  ప్రభుత్వ హాస్పిటల్స్.. ఎన్జీవోల నిధులపై ఆధారపడుతున్నాయి.

ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా వచ్చినా, పెరిగిపోతున్న వైద్యం ఖర్చులు తట్టుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్స్ కే వెళ్తున్నారు రోగులు. కానీ సర్కార్ ఆస్పత్రుల్లో  ఔడేటెడ్ ఎక్విప్మెంట్ తో రోగులు ఇబ్బందులు  పడుతున్నారు. ఇది వరకటి రోజుల్లో డయగ్నోసిస్ సర్వీస్ లేదు. కానీ ఇప్పుడు ఏ రోగానికైనా మెడికల్ టెస్టుల తప్పనిసరి అయ్యాయి. అయితే.. ప్రభుత్వ ఆస్పత్రిల్లో మిషనరీ ఒకటి పని చేస్తే మరొకటి పని చేయదు. ప్రతీ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నా.. వైద్య అవసరాలకు తగ్గట్లుగా సరిపోవడం లేదు. కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్స్ ను అభివృధ్ది చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు.

ప్రభుత్వ ఆస్పత్రులు ఎన్జీవో ఫండ్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కొన్ని ఎన్జీవోలు.. స్కానింగ్.. ఎక్సరే మిషన్స్, వాకర్స్, ఈసీజీ మిషన్స్ డొనేట్ చేస్తున్నారు. ఇక ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నీలోఫర్, కోటి మెటర్నిటీ లాంటి హాస్పిటల్స్ కు ఎన్జీవోలు సహాయం చేస్తున్నాయి. ఉస్మానియా హాస్పిటల్ కు 2018 నుంచి ఇప్పటి వరకూ 2 కోట్ల రూపాయిల విలువైన మెడికల్ ఎక్విప్మెంట్ విరాళాల రూపంలో అందాయి.

హాస్పిటల్ కు ఎన్జీవోల నిధులు బాగా ఉపయోగపడుతున్నాయంటున్నారు డాక్టర్లు. డబ్బు రూపంలో కాకుండా.. ఎక్విప్మెంట్ రూపంలో మిషనరీని ఇస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందాలని ఎన్జీవోలు ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్జీవోలతో పాటు CSR కింద ఫండ్ ఇచ్చేందుకు కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తే బాగుంటుందంటున్నారు వైద్యులు. ప్రతి కార్పొరేట్ కంపెనీ 2 శాతం లాభాలను సామాజిక సేవకు కేటాయించి.. ఆ నిధులను హాస్పిటల్ కు మళ్ళిస్తే.. జనానికి ఎంతో మంచి జరగుతుందంటున్నారు.

సర్కార్ హాస్పిటల్స్  బాగుపడితే పేదవాడికి మెరుగైన వైద్యం అందుతుందంటున్నారు జనం. ప్రభుత్వ హాస్పిటల్స్ పై సర్కార్ దృష్టిపెట్టాల్సి ఉందని చెప్తున్నారు. రానున్న బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించడంతో పాటు.. CSR ఫండ్స్ ను కూడా హస్పిటల్స్ కు మళ్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు.