ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో బెంగళూరు బుల్స్ అద్భుత విజయం సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్లో 35–33తో పట్నా పైరేట్స్ను ఓడించింది. ఓ దశలో 12 పాయింట్లతో వెనుకంజ వేసిన ఆ జట్టు చివరి నిమిషాల్లో గొప్పగా పుంజుకుంది.
ఆల్ రౌండర్ సచిన్ నర్వాల్ 9 పాయింట్లు, డిఫెండర్ సుర్జీత్ సింగ్ 8 పాయింట్లతో సత్తా చాటారు. ఆఖర్లో చేసిన సూపర్ ట్యాకిల్స్ బుల్స్ను గెలిపించాయి. మరో మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ కేసీ 40–34తో యు ముంబాపై నెగ్గింది. మంగళవారం జరిగే మ్యాచ్లో తెలుగు టైటాన్స్తో బెంగాల్ వారియర్స్ జట్టు పోటీ పడుతుంది.