అద్వానీ పేరు వింటే రథయాత్ర గుర్తుకు వస్తుంది: పవన్​ కళ్యాణ్​

అద్వానీ పేరు  వింటే రథయాత్ర గుర్తుకు వస్తుంది: పవన్​ కళ్యాణ్​

భారతరత్న  అవార్డుకు ఎంపికైన ఎల్‌కే అద్వానీ(LK Advani)కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభినందనలు తెలిపారు. భారత రాజకీయాల్లో అద్వానీ తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారని కొనియాడారు. శనివారం ( ఫిబ్రవరి3)  ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యున్నతమైన భారతరత్న  పురస్కారానికి అద్వానీని ఎంపిక చేయడం సంతోషదాయకమని తెలిపారు. 

సుదీర్ఘమైన ప్రజాజీవిత అనుభవం కలిగిన అద్వానీకి తన తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అద్వానీ పేరు వినగానే ఎవరికైనా రథయాత్ర గుర్తుకు వస్తుందని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం చేపట్టిన రథయాత్ర భారత రాజకీయ, పాలన వ్యవస్థల్లో కీలక మలుపును తీసుకువచ్చిందని గుర్తుచేశారు. అయోధ్యలో శ్రీరాముని ఆలయం నిర్మితమైన వేళ అద్వానీని భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయడం ఆనందదామకమని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకీ, కేంద్ర ప్రభుత్వానికీ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.