- ఎర్రచందనం..వెంకటేశ్వరస్వామి రక్తం నుంచి పుట్టిన చెట్టు: పవన్ కళ్యాణ్
ఎర్రచందనం చెట్ల పుట్టుకపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రచెందనం చెట్లు వెంకటేశ్వరస్వామి గాయం రక్తం నుంచి పుట్టిన చెట్టు.. దానిని నరికివేయొద్దు.. అక్రమంగా విక్రయించొద్దు అన్నారు. శనివారం (నవంబర్ 8) ఎర్రచందనం స్మగ్లింగ్పై మీడియా తో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. గత ప్రభుత్వం హయాంలో భారీగా ఎర్ర చందన స్మగ్లింగ్ జరిగిందన్నారు. ఆ సమయంలో దాదాపు 2.65 లక్సల ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అదికారులు పట్టుకున్నారు.. అంటే దాదాపు లక్షా 30వేల చెట్లను నరికివేశారు.. వీటి విలువ ఐదు వేల కోట్లు ఉంటుందని అన్నారు. ఇక పట్టుకున్నదే ఇంత అయితే.. దొరక్కకుండా స్మగ్లింగ్ చేసింది ఇంతకు రెట్టింపు ఉండొచ్చని అంచనా వేశారు.. 2019–2024 మధ్య కాలంలో దదాపు 8నుంచి 10 వేల కోట్ల ఎర్ర చందనం స్మగ్లింగ్ జరిగిందని ఆరోపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
రాష్ట్రంలో ఎవరి ఊహకు అందనంత సొత్తు ఎర్ర చందనం స్మగ్లింగ్ తో దోచుకున్నారు. శేషాచల అడవిలో ఇప్పుడు పెద్ద పెద్ద ఎర్రచందనం చెట్లు కనుమరుగవుతున్నాయని అన్నారు వపన్ కళ్యాణ్. ఎర్రచందనం విషయంలో మనకు ఇతర రాష్ట్రాలకు మధ్య సమన్వయంతో పనిచేస్తామన్నారు.
అన్ని రాష్ట్రాలతో సమన్వయం ద్వారా ఎర్ర చందనం స్మగ్లింగ్ కు చెక్ పెడతామన్నారు పవన్. ఉమ్మడి కడప జిల్లాలో మూడు జోన్లలో విపరీతంగా స్మగ్లింగ్ జరుగుతుందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నలుగురు కింగ్ పిన్ లను గుర్తించాం.. వారిని త్వరలో పట్టుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
ఎవరూ ఎర్రచందనం స్మగ్లింగ్ వృత్తిలోకి వెళ్లొద్దు.. ఏపీ, తమళనాడు వాళ్లకు కూడా ఇదే చెబుతున్నాను.. ఎర్రచందనం స్మగ్లింగ్ పాల్పడితే తాట తీస్తామని స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్ర నిర్వహించిన ఆపరేషన్ కగర్ మాదిరిగానే ఇక్కడ మరో ఆపరేషన్ చేపడతామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎర్ర చందనం చెట్లు కొట్టాలంటేనే భయపడే స్థితికి తీసుకువస్తామన్నారు పవన్. ఒక చెట్టు కొడితే చరిత్రలో యుద్ధాలు జరిగాయి.. ఇతర రాష్ట్రాల్లోని ఓడరేవుల ద్వారా ఎర్రచందనం తరలిపోయే అంశంపై కూడా దృష్టి పెడుతున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు.
