ఉస్తాద్ పై పవన్  ఫోకస్

ఉస్తాద్ పై పవన్  ఫోకస్

ఇటీవల ‘బ్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఫోకస్ పెట్టారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత  హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం  కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఇప్పటికే కొంత పార్ట్ షూట్ పూర్తయింది. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్‌‌ను స్టార్ట్ చేసి నాన్‌‌స్టాప్‌‌గా షూట్‌‌లో పాల్గొనేలా పవన్ ప్లాన్ చేస్తున్నారట. వీలైనంత త్వరగా తన పార్ట్‌‌ను పూర్తి చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

దీంతో ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో ఉండేలా హరీష్ శంకర్ భావిస్తున్నాడట. శ్రీలీల హీరోయిన్‌‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు సుజీత్ డైరెక్షన్‌‌లో నటిస్తున్న  ‘ఓజీ’ చిత్రాన్ని కూడా పవన్ ఈ ఏడాదే పూర్తి చేయాలనుకుంటున్నారట.