జనసేనలో నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్

జనసేనలో నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్

నాగబాబును  జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.  నాగబాబు ప్రస్తుతం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఆయన సేవలు మరింత విస్తృతంగా పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు విదేశాలలో ఉన్న పార్టీ ప్రతినిధులు, అభిమానులను నాగబాబు కోఆర్డినేట్ చేస్తారు. ఎన్‌ఆర్‌ఐల సేవలను పార్టీకి సమర్థవంతంగా ఉపయోగపడే విధంగా నాగబాబు సేవలు అందిస్తారు. 

అదే విధంగా నెల్లూరుకు చెందిన ఉన్నత విద్యావంతుడు, గత కొన్నేళ్లుగా జనసేన పార్టీకి పరోక్షంగా సేవలందిస్తున్న వేములపాటి అజయ కుమార్‌ ను  జాతీయ మీడియాకు పార్టీ తరపున అధికార ప్రతినిధిగా నియమించారు. రాజకీయ శిక్షణ తరగతులు, బూత్‌ స్థాయి పర్యవేక్షణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ (కాన్ఫిక్ట్‌ మేనేజ్మెంట్‌) నిర్వహణ బాధ్యతలను  అజయ కుమార్‌  నిర్వహించనున్నారు. వీరిద్దరు  పార్టీకి సేవలందిస్తారని పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. నాగబాబు,అజయ లకు అభినందనలు తెలియజేశారు పవన్.