నెక్స్ట్ ఏంటి? పార్టీ నేతలతో పవన్ సమావేశం

నెక్స్ట్ ఏంటి? పార్టీ నేతలతో పవన్ సమావేశం

అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేన అధినేత పవన్  కళ్యాణ్ మొదటి సారిగా పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఎన్నికలు జరిగిన విధానం, పోలింగ్ సరళి, నేతల పనితీరు, పార్టీ గెలుపు అవకాశాలు, భవిషత్ కార్యాచరణపై నేతలతో చర్చించనున్నారు. గుంటూరులోని మంగళగిరిలో ఈ సమావేశం జరుగుతుంది. విడతల వారీగా పార్టీ నేతలతో సమీక్ష జరుపుతున్నారు.  మొదటి విడతలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 140 స్థానాల్లో పోటీచేసింది. మిగతా స్థానాల్లో మిత్రపక్షాలు అయిన సీపీఐ,సీపీఎం,బీఎస్పీ పోటీ చేశాయి.