IPL 2026: RCB పట్టిందల్లా బంగారమే.. టీమిండియా యంగ్ ప్లేయర్ మ్యాచ్ విన్నింగ్ స్పెల్

IPL 2026: RCB పట్టిందల్లా బంగారమే.. టీమిండియా యంగ్ ప్లేయర్ మ్యాచ్ విన్నింగ్ స్పెల్

ఐపీఎల్ 2026 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరింత పటిష్టంగా మారనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఐపీఎల్ 2026 మెగా ఆక్షన్ లో కొనుగోలు చేసిన ఇండియన్ యంగ్ ప్లేయర్ ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో అదరగొడుతున్నాడు. శనివారం (జనవరి 17) బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విహాన్ అద్భుతమైన స్పెల్ తో మ్యాచ్ ను గెలిపించాడు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా 17.2 ఓవర్లకు 90/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో వర్షం వచ్చి గ్రౌండ్ చిత్తడిగా మారడంతో ఆట ఆగింది. 

దాంతో బంగ్లా టార్గెట్‌‌‌‌‌‌‌‌ను 29 ఓవర్లలో 165 రన్స్‌‌‌‌‌‌‌‌ గా సవరించారు. ఆట తిరిగి మొదలయ్యాక ఇండియా బౌలర్లు అద్భుత పెర్ఫామెన్స్ చేశారు. ఫిఫ్టీ పూర్తి చేసుకొని జోరు మీదున్న అజిజుల్ హకీం (51)ను ఔట్ చేసిన ఖిలాన్ పటేల్ కీలక బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి విహాన్ మల్హోత్రా షో సాగింది. మల్హోత్రా ధాటికి సిద్దిఖీ (15), జిబాన్ (7) రిజాన్ (15), సుమియున్ (2) పెవిలియన్ బాట పట్టడంతో బంగ్లా 28.3 ఓవర్లలో 146 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటై ఓడిపోయింది. మ్యాచ్ ను గెలిసిపించిన విహాన్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో విహాన్ మల్హోత్రా 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. 

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ లో 19 ఏళ్ళ విహాన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బేస్ ప్రైస్ రూ. 30 లక్షలకు దక్కించుకుంది. గత సీజన్ లో జరిగిన మెగా ఆక్షన్ లో ఆర్సీబీ కొన్న ఆటగాళ్లు అందరూ అద్భుతంగా రాణించారు. ఈ సారి కూడా 2026 సీజన్ కు ముందు ఆర్సీబీ ప్లేయర్స్ ఆకట్టుకుంటున్నారు. 

బంగ్లాపై ఇండియా థ్రిలింగ్ విక్టరీ:

అండర్-19 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో యంగ్ ఇండియా వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. ఓటమి ఖాయం అనుకున్న దశలో స్పిన్నర్ విహాన్ మల్హోత్రా (4/14) చేసిన మ్యాజిక్‌‌‌‌‌‌‌‌తో శనివారం జరిగిన  గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 18 రన్స్ తేడాతో (డక్‌‌‌‌‌‌‌‌వర్త్ లూయిస్) బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 49 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా 48.4 ఓవర్లలో 238 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. 

అభిజ్ఞాన్‌‌‌‌‌‌‌‌ కుందు (112 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 80), యంగ్‌‌‌‌‌‌‌‌ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (67 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72) సత్తా చాటారు. బంగ్లాదేశ్ పేసర్ అల్ ఫహాద్ (5/38) ధాటికి  కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ఆయుష్​ మాత్రే (6), వేదాంత్ (0), విహాన్ (7), హర్వాన్ష్‌‌‌‌‌‌‌‌ (2), అంబరీష్ (5) పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు క్యూ కట్టినా.. వైభవ్‌‌‌‌‌‌‌‌, కుందు జట్టును ఆదుకున్నారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా 17.2 ఓవర్లకు 90/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో వర్షం వచ్చి గ్రౌండ్ చిత్తడిగా మారడంతో ఆట ఆగింది. దాంతో బంగ్లా టార్గెట్‌‌‌‌‌‌‌‌ను 29 ఓవర్లలో 165 రన్స్‌‌‌‌‌‌‌‌ గా సవరించారు. 165 పరుగుల టార్గెట్ లో బంగ్లాదేశ్ 146 పరుగులు ఆలౌటైంది.