
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఓ యాక్షన్ సీక్వెన్స్ని పూర్తి చేశారు. ఇది పూర్తి స్థాయి ప్యాన్ ఇండియా సినిమా అని, సౌత్ ప్రేక్షకులకు ఎంతగా నచ్చుతుందో నార్త్ ఇండియన్స్కూ అంతే నచ్చుతుందని నిర్మాత ఏ.ఎం.రత్నం చెబుతున్నారు. ఇది పూర్తయ్యాక పవన్ షూటింగ్ స్టార్ట్ చేయబోయే నెక్స్ట్ మూవీ ఏమిటనే విషయంపై ఆసక్తి నెలకొంది. మేనల్లుడు సాయిధరమ్ తేజ్తో కలిసి ‘వినోదయ సిత్తం’ రీమేక్లో పవన్ నటించాల్సి ఉంది. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కాల్సిన చిత్రం ఎప్పటినుండో అభిమానులను ఊరిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఈ మూవీకి ‘ఉస్తాద్ భగత్సింగ్’ అనే టైటిల్ ఫైనల్ చేయడంతో పాటు ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
మరోవైపు ‘సాహో’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లోనూ ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత డీవీవీ దానయ్య నిర్మించబోతున్న సినిమా ఇది. ఈ మూడింటిలో ఏది ముందుగా సెట్స్కు వెళుతుందనేదే అసలు ప్రశ్న. అయితే ‘వినోదయ సిత్తం’ రీమేక్ను ముందుగా స్టార్ట్ చేయబోతున్నట్టు టాక్. మిగతా రెండింటితో పోల్చితే బడ్జెట్తో పాటు పవన్ క్యారెక్టర్ డ్యురేషన్ కూడా తక్కువ కనుక దీన్నే ముందుగా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరిలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.