గద్దర్ భౌతిక కాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పవన్

గద్దర్ భౌతిక కాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పవన్

ఎల్బీ స్టేడియంలో  గద్దర్ భౌతిక కాయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. గద్దర్ భౌతిక కాయాన్ని చూసిన పవన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

గద్దర్ మరణించారంటే నమ్మశక్యంగా లేదు: పవన్ 

గద్దర్ మరణించారంటే నమ్మశక్యంగా లేరన్నారు పవన్. ఆస్పత్రిలో పరామర్శించేందుకు కొన్ని రోజుల క్రితమే వెళ్లానని..తమ్ముడా అంటే ఆప్యాయంగా పలకరించారని గుర్తు చేశారు. మా భూమి సినిమాలో బండెనక బండికట్టి పదహారు బళ్లు కట్టి సాంగే తనకు గద్దర్  అనే పేరును పరిచయం చేసిందన్నారు. గద్దర్ మరణం ఆయన కుటుంబానికే కాకుండా తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన్ని చివరిసారిగా కలిసినప్పుడు నీ అవసరం నేటి యువతకు ఉందంటూ తనకు చెప్పిన మాటలు ఎన్నటికీ మరువలేనివన్నారు.

గద్దర్ అంత్యక్రియలు రేపు (ఆగస్టు7) ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.  అధికార లాంఛనాలతో నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు.  రేపు మధ్నాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా అల్వాల్ లోని  గద్దర్ ఇంటి వరకు అంతిమ యాత్ర జరగనుంది. అల్వాల్ లోని మహభోది స్కూల్ గ్రౌండ్ లో గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి.