50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ సినిమా

50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ సినిమా

‘వకీల్‌‌‌‌సాబ్’తో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చిన పవన్‌‌‌‌.. సంక్రాంతికి ‘భీమ్లానాయక్‌‌‌‌’గా రాబోతున్నాడు.  క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలకి కూడా కమిట్‌‌‌‌మెంట్ ఇచ్చి మరో రెండేళ్లకు సరిపడా సినిమాలతో తన డైరీని నింపేసుకున్నాడు. ప్రస్తుతం ‘భీమ్లానాయక్’ పనుల్లో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. ఈ మూవీ ఫినిషింగ్ స్టేజ్‌‌‌‌లో ఉంది. ఇది పూర్తవ్వగానే ‘హరిహర వీరమల్లు’ మూవీ సెట్స్‌‌‌‌లో తిరిగి జాయినవబోతున్నాడు. మొఘులుల కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటు క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడు. దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌ కోసం ఢిల్లీ, రాజస్థాన్‌‌‌‌లోని పలు ప్రాంతాలను పరిశీలిస్తోంది టీమ్. రాజస్థాన్  ఎడారుల్లో ఓ పెద్ద సెట్ వేయాలనుకుంటున్నారట. దీని కోసం ఆర్ట్‌‌‌‌ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి క్రిష్ అక్కడికి వెళ్లాడు.  వచ్చే నెలాఖరులో కానీ, జనవరి ఫస్ట్ వీక్‌‌‌‌లో కానీ షూట్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్జున్ రామ్‌‌‌‌పాల్  కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 29న సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు.