ఆ నిర్లక్ష్యం వల్లే కిడ్నీ సమస్య.. పాపం పాయల్

ఆ నిర్లక్ష్యం వల్లే కిడ్నీ సమస్య.. పాపం పాయల్

పంజాబీ బ్యూటీ పాయల్​ రాజ్​పుత్(Payal rajputh)​ ఇటీవల తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పి షాకిచ్చింది. పాయల్​ కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్​ కంగారుపడ్డారు. తాజాగా ఈ విషయంపై మరోసారి స్పందించింది. తనకు నీళ్లు తక్కువ తాగే అలవాటు ఉండేదని దాని వల్లే కిడ్నీ సమస్యల బారిన పడ్డట్టు తెలిపింది. అందుకే ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా అందరూ శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకోవాని సూచించింది.

తన మొదటి ప్రేమ గురించి చెప్తూ తాను స్కూల్​ డేస్​లోనే ఓ అబ్బాయిని ఇష్టపడ్డానని తెలిపింది. తన ప్రపోజల్​ను రిజెక్ట్​ చేయడంతో తన హైస్కూల్​ చదువు డిస్టర్బ్​ అయ్యిందని ఆ టైంలో తన తల్లి వల్లే తిరిగి నార్మల్​ అయినట్టు పాయల్​ వివరించింది. ఈ హీరోయిన్​ నటించిన ‘మంగళవారం’ ఈ నెల 17న రిలీజ్​ కానుంది.