
- 49 ఫిర్యాదులు స్వీకరించిన అడిషనల్డైరెక్టర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గుడి, బడి, కమ్యూనిటీ హాళ్ల ప్లాట్లను కూడా కబ్జా చేస్తున్నారని హైడ్రా ప్రజావాణిలో ప్రజలు ఫిర్యాదులు చేశారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులందాయి. ఇందులో నాలాలు, పార్కులను ఆక్రమించి భవనాలు నిర్మించి అద్దెలు వసూలు చేస్తున్నారని కంప్లయింట్స్వచ్చాయి. ఫిర్యాదులను హైడ్రా అడిషనల్ డైరెక్టర్వర్ల పాపయ్య స్వీకరించారు. ఫతేనగర్ శివాలయ సమీపంలోని నాలాను ఆక్రమించి షెడ్లు వేసి నెలకు రూ. లక్షన్నర వరకు అద్దెలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తుర్కయాంజల్ శ్రీ సూర్య సాయినగర్ లో పార్కు ల్యాండ్ తమదంటూ పక్క సర్వే నంబర్వ్యక్తి కబ్జా చేస్తున్నారని సాయినగర్ వాసులు ఫిర్యాదుచేశారు. శామీర్పేటలోని యూఎస్ఎం మై సిటీ లేఅవుట్ రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మించారంటూ ఫిర్యాదు చేశారు.
నాలుగు కలెక్టరేట్లలో..
హైదరాబాద్కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్హరిచందన 148 ఫిర్యాదులను, రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్కలెక్టరేట్లో అడిషనల్కలెక్టర్ ప్రతిమా సింగ్ 73, మేడ్చల్మల్కాజిగిరి ఐడీఓసీ ఆఫీసు మీటింగ్హాల్లో కలెక్టర్ మను చౌదరి 97, వికారాబాద్లో కలెక్టర్ప్రతీక్జైన్185 ఆర్జీలను స్వీకరించారు.
బల్దియాలో..
బల్దియాలో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ ఆర్వీ కర్ణన్ తో కలిసి మేయర్ విజయలక్ష్మి 74 ఫిర్యాదులను స్వీకరించారు. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో 91 ఫిర్యాదులు వచ్చాయి.