
హైదరాబాద్, వెలుగు: రిటైల్ షాపింగ్లో ప్రత్యేక బ్రాండ్ సృష్టించుకున్న ఆర్ఎస్ బ్రదర్స్, ‘దసరా బ్లాక్బస్టర్ స్పాట్ గిఫ్ట్స్’ ఆఫర్లతో వినియోగదారులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. రూ.2 వేల విలువ చేసే ప్రతీ కొనుగోలుపై గిఫ్ట్ ఇస్తోంది. ఈ ఆఫర్లు కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయని సంస్థ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది.
రూ.4,495 విలువైన పట్టుచీరను కొంటే రూ.45 కే మరో చీరను కానుకగా ఇస్తామని తెలిపింది. అదేవిధంగా రూ.4,995 విలువ చేసే పట్టు చీర కొంటే మిక్సీగ్రైండర్ను గిఫ్ట్గా ఇస్తామని వెల్లడించింది. లేడిస్ వెస్ట్రన్వేర్, మెన్స్వేర్, కిడ్స్వేర్పై కూడా అనేక రకాల ఆకర్షణీయమైన కానుకలు కొనుగోలుదారులకు అందిస్తామని తెలిపింది.
ఆకర్షణీయమైన డిజైన్లు, సరికొత్త వెరైటీలతో పండుగ కలెక్షన్, సరసమైన ధరలతో అద్భుతమైన ఆఫర్స్, స్పాట్లోనే గిఫ్ట్లు ఇవ్వడంతో వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు.