- మనీలాండరింగే కారణం
న్యూఢిల్లీ: మనీలాండరింగ్కు పాల్పడిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ రూ.5.49 కోట్ల జరిమానా విధించింది. అక్రమ వ్యాపారాలు చేసే సంస్థల డబ్బు పేటీఎం ఖాతాల ద్వారా దారి మళ్లిస్తున్నారని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి దర్యాప్తు సంస్థల ద్వారా సమాచారం అందుకున్న ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ విచారణ జరిపింది. ఈ సంస్థలు ఎక్కువగా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించింది.
జనవరి 31న, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 29లోపు బ్యాంకింగ్ సేవలను నిలిపివేయాలని పేటీఎం పేమెంట్స్బ్యాంకును కోరింది. ఆ తర్వాత గడువును మార్చి 15 వరకు పొడిగించింది. పేటీఎం దాని బ్యాంకింగ్ అనుబంధ సంస్థతో వ్యాపార సంబంధాలను తగ్గించుకుంటున్నట్లు చెప్పిన తర్వాత ఇలా జరిగింది. పేటీఎం, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ రెండూ బిలియనీర్ విజయ్ శేఖర్ శర్మ ఫిన్టెక్ కంపెనీలు.