9 శాతం పతనమైన పేటీఎం షేర్లు

9 శాతం పతనమైన పేటీఎం షేర్లు

న్యూఢిల్లీ : పేటీఎంను నిర్వహించే వన్​97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం దాదాపు 9 శాతం పడిపోయాయి. అమ్మకాల ఒత్తిడే ఇందుకు కారణం.  బీఎస్​ఈలో షేరు 8.67 శాతం తగ్గి రూ. 408.30కి చేరుకుంది. ఎన్‌‌ఎస్‌‌ఈలో కంపెనీ షేర్లు 8.20 శాతం పతనమై రూ.410కి చేరాయి.  వన్​97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు గురువారం లోయర్ సర్క్యూట్​ను తాకడంతో 10 శాతం పడిపోయాయి. మూడు రోజుల పతనం తర్వాత మంగళవారం 3 శాతానికి పైగా పుంజుకుంది. 

కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించడంతో కంపెనీ స్టాక్ మూడు రోజుల్లో 42 శాతానికి పైగా పడిపోయింది. మార్కెట్ విలువ రూ. 20,471.25 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. పేటీఎం చాలా సార్లు రూల్స్​ను ఉల్లంఘించడంతో చర్యలు తీసుకున్నామని ఆర్​బీఐ తెలిపింది. ఫిబ్రవరి 29 తరువాత కొత్త కస్టమర్లను తీసుకోవడాన్ని ఆపేయడంతోపాటు వాలెట్​, డిపాజిట్​, ప్రీప్రెయిడ్​సేవలు అందించకూడదని స్పష్టం చేసింది.