న్యూఢిల్లీ : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేటీఎం పేరెంట్ కంపెనీ అయిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ థర్డ్- పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ)గా యూపీఐ సేవలు అందించడానికి అనుమతిని మంజూరు చేసింది.
ఆర్బీఐ ఆంక్షల కారణంగా యూపీఐ సేవలు నిలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో పేటీఎంకు ఈ అవకాశం వచ్చింది. పేమెంట్స్ కోసం యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, యెస్ బ్యాంకులు పార్ట్నర్ బ్యాంకులుగా (పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ ) పనిచేస్తాయి.