తెలంగాణలో ఉప ఎన్నికలకు చాన్స్‌‌‌‌ లేదు ..దసరా తర్వాత కామారెడ్డిలో సభ: మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణలో  ఉప ఎన్నికలకు చాన్స్‌‌‌‌ లేదు ..దసరా తర్వాత కామారెడ్డిలో సభ: మహేశ్ కుమార్ గౌడ్

నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు చాన్స్​ లేదని పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్​పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని, పార్టీలు మారిన వారి గురంచి బీఆర్ఎస్​ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన నిజామాబాద్​ ఆర్అండ్​బీ గెస్ట్​ హౌజ్​లో మీడియాతో మాట్లాడారు. స్పీకర్​ ఇచ్చిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు స్పష్టత ఇచ్చారని, వారంతా బీఆర్ఎస్​లోనే కొనసాగుతున్నారని, ప్రతి నెలా పార్టీ మెంబర్​ షిప్​ ఫీజు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. 

ఉప ఎన్నికలు వచ్చే చాన్స్​ ఉండదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ విషయంలో కాంగ్రెస్​ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని, రిజర్వేషన్​ సాధించాకే లోకల్​ బాడీ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్లడానికి రెడీగా ఉన్నామని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్​ ప్రకారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చి తీరుతామన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్​కు బీసీల పట్ల ప్రేమ ఉంటే మంత్రి కిషన్​రెడ్డితో కలిసి కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్​ చేశారు. వారిద్దరూ తలుచకుంటే ఒక్క రోజులోనే రిజర్వేషన్​ అమలులోకి వస్తుందన్నారు. కామారెడ్డి సభను దసరా పండుగ తరువాత నిర్వహిస్తామన్నారు. అనంతరం లైబ్రరీని విజిట్​ చేసి యువతతో మాట్లాడారు. ఉత్తర తిరుపతి ఆలయాన్ని సందర్శించి ఎస్జీఎస్​ పద్మావతి అన్నదాన, ఇందూర్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. లైబ్రరీ చైర్మన్​  అంతిరెడ్డి రాజిరెడ్డి, టీపీసీసీ జనరల్​ సెక్రటరీ రాంభూపాల్​ ఉన్నారు.