హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ సర్కార్ అన్ని రంగాల్లోనూ ఫెయిలైందని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ కుసుమ కుమార్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే బీఆర్ఎస్ నేతలు అబద్ధాలాడుతూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఏఐసీసీ అధికార ప్రతినిధి డోలి శర్మ, ఏఐసీసీ మీడియా అబ్జర్వర్లు గౌతమ్ సేథ్, అలీ మహాదీలతో కలిసి గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.
మేనిఫెస్టో అంటే రాజకీయ పార్టీలకు ప్రమాణ పత్రం లాంటిదన్నారు. కానీ, కేసీఆర్ ప్రజలకు హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేశారని ఫైర్ అయ్యారు. వరాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని డోలి శర్మ ఆరోపించారు. అత్యాచారాల్లో తెలంగాణ నంబర్ వన్ అని పేర్కొన్నారు. మహిళలకు కనీసం వెల్ఫేర్ బోర్డు కూడా లేదని తెలిపారు. లిక్కర్ సేల్స్ దేశంలోకెల్లా తెలంగాణలోనే ఎక్కువన్నారు.
నియామకాలు చేపట్టకుండా యువతను మోసం చేసిందని గౌతమ్ సేథ్ విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని అలీ మహాదీ ఆరోపించారు. అవినీతిలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నారు. కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్కు పాల్పడినట్టు తేలిందని అలీ మహాది పేర్కొన్నారు.