అమరుల స్థూపం వద్ద కేటీఆర్​ ఇంటర్వ్యూనా? : జి.నిరంజన్​

అమరుల స్థూపం వద్ద కేటీఆర్​ ఇంటర్వ్యూనా? : జి.నిరంజన్​

హైదరాబాద్, వెలుగు : కొత్తగా నిర్మించిన అమరుల స్థూపం వద్ద కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూకు పర్మిషన్ ఎలా​ఇచ్చారని పీసీసీ సీనియర్​ వైస్​ప్రెసిడెంట్​ నిరంజన్ ప్రశ్నించారు. కొత్త సచివాలయం, అంబేద్కర్​విగ్రహం కనిపించేలా ఇంటర్వ్యూ  షూట్ చేశారని తెలిపారు.

గురువారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. అమరుల స్థూపం వద్ద ఇంటర్వ్యూకు పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారని నిలదీశారు. దీనిపై ఎన్నికల కమిషన్​విచారణ జరిపించాలని కోరారు. కేసీఆర్​కు గోరటి వెంకన్న తొత్తులా పనిచేస్తున్నారని విమర్శించారు. 

ALSO READ: గ్లోబల్​ మార్కెట్లోకి అడుగుపెడుతున్న .. మన గేమ్​ స్ట్రీమింగ్​ యాప్స్​