ఆయనపై పీడీ యాక్ట్‌‌ నమోదు చేయడం సబబే : ప్రభుత్వం

ఆయనపై పీడీ యాక్ట్‌‌ నమోదు చేయడం సబబే : ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, ఆయనపై పీడీ యాక్ట్‌‌ నమోదు చేయడం సబబేనంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. పీడీ యాక్ట్​ రద్దు చేయాలంటూ ఆయన భార్య ఉషాబాయి దాఖలు చేసిన పిటిషన్​ను జస్టిస్​ అభిషేక్​ రెడ్డి, జస్టిస్​ శ్రీదేవితో కూడిన డివిజన్​ బెంచ్ బుధవారం విచారించింది. 

హత్య కేసు సహా మొత్తం వంద కేసులు ఆయనపై ఉన్నాయని, మంగళ్‌‌హాట్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌లో ఇప్పటికీ రౌడీషీట్‌‌ ఉందని అడ్వకేట్ జనరల్ బీఎస్​ ప్రసాద్ కోర్టుకు వివరించారు. మూడు క్రిమినల్‌‌ కేసుల ఆధారంగా పీడీ యాక్ట్‌‌ కింద అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇది కేవలం కక్ష సాధింపేనని రాజాసింగ్ తరఫు అడ్వకేట్​ ఎల్ రవి చందర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పీడీ యాక్ట్ నిబంధనలను పోలీసులు ఎక్కడా పాటించలేదని ఆరోపించారు. ఇరువైపుల వాదనలు విన్న డివిజన్​ బెంచ్, తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.