ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..

ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..

ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి.. మన లైఫ్‌లో ఓ భాగం అయిపోయింది. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యలు.. ఇలా ఒత్తిడికి గురవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇంటి బడ్జెట్‌- పనులు, పిల్లలు, బంధులు కారణంగానూ తీవ్ర ఒత్తిడికి గురవుతుంటాం. ఇంట్లో పనులు ఎక్కువై ఎంతో మంది మహిళలు ఒత్తిడి బారిన పడుతున్నారు. ఆ ఒత్తిడిని తగ్గించుకొని ఆందోళన లేకుండా జీవించాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. సామాన్యుల దగ్గరి నుంచి విద్యార్థులు, మేధావులు, అధికారులు, కార్పొరేట్‌ దిగ్గజాల వరకూ అంతా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు.అలాంటి వారు  ప్రతిరోజూ ఉదయం లేచాక కొన్ని రకాల మంత్రాలను జపించడం వల్ల  ఒత్తిడి, ఆందోళన తగ్గి జీవితం సాఫీగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పడు ఆ మంత్రాలు ఏంటో తెలుసుకుందాం. . .

ఓం

ఓంకారం చాలా ప్రభావితమైనది. ఓం మంత్రం వల్ల మనసు ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా శరీరం పైనే దృష్టి పెట్టేందుకు కేంద్రీకరిస్తుంది. ఓంకారం జపించడం వల్ల మనసుకి, మెదడుకి గొప్ప శక్తి లభిస్తుంది. నిత్యం జపిస్తూ ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనసుకి ప్రశాంతత లభిస్తుంది. మొత్తం శరీరం, మనసు, ఆత్మని ఒక చోట చేర్చే సంపూర్ణ అనుభవం. ఓం జపించే సమయంలో వచ్చే కంపనాలు మన నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఓం జపించడం వల్ల ఒత్తిడి, ఆందోళన, చంచలత్వం తగ్గుతాయి. ప్రశాంతంగా ఉండటాన్ని ప్రోత్సహిస్తుంది. క్రమం తప్పకుండా ఓం జపించడం వల్ల స్వీయ అవగాహన, స్వీయ అంగీకారం, ఆధ్యాత్మిక వృద్ధి పెరుగుతుంది. . అత్యంత భక్తితో ఓం జపించే వ్యక్తి చాలా స్పష్టంగా ఉంటారు. ఓం అని పలుకుతున్నప్పుడు వచ్చే రిథమిక్ శబ్ధం నాడీ వ్యవస్థను శాంతి పరుస్తుంది. ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. ధ్యాన స్థితిని ప్రేరేపిస్తుంది.

మహా మృత్యుంజయ మంత్రం

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
 ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

శివునికి చెందినది మహామృత్యుంజయ మంత్రం. అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఇది ఒకటి. అజ్ఞానం, ప్రతికూల ఆలోచనలతో ఉన్న భక్తులు ప్రతిరోజూ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మంచిది. దేవుడు ఆ అజ్ఞానాన్ని నాశనం చేస్తాడని అంటారు. . ఈ మంత్రాన్ని సరైన ఆచారాల ద్వారా జపించడం వల్ల త్వరలో మీరు ఆందోళన నుంచి విముక్తి పొందుతారు. అంతేకాదు మీ వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలు పొందడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీరు రోజువారి జీవితంలో ఉండే భయాలు, ఒత్తిడి, ఆందోళన వంటివి తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని జపించే వారిలో దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే హృదయంలో దైవం నిండుకుంటుందో... అప్పుడు ఆందోళన, భయం వంటివి దూరమైపోతాయి.

గాయత్రీ మంత్రం

ఓం భూర్బువః స్వః తత్సవితుర్వరేణ్యం..భర్గో దేవస్య ధీమహి..ధియో యో నః ప్రచోదయాత్’

మన దేశంలోని ఎన్నో పాఠశాలల్లో ఉదయం పూట గాయత్రీ మంత్రాన్ని పిల్లల చేత జపించేలా చేస్తారు. సంస్కృత భాషా తరగతుల్లో కూడా గాయత్రి మంత్రాన్ని కచ్చితంగా జపిస్తారు. గాయత్రీ మంత్రానికి దైవిక శక్తి ఎక్కువ. గాయత్రీ మంత్రం ‘ఓం’ తో మొదలవుతుంది. దీన్ని ప్రతిరోజూ పఠించడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. తెలివితేటలు పెరుగుతాయి. గాయత్రి మంత్రాన్ని జపించే వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంతర్గత శక్తి అభివృద్ధి చెందుతుంది.గాయత్రీ మంత్రం పఠించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రాకుండా, గందరగోళాలన్నీ ముగిసిపోతాయి.

హనుమాన్ చాలీసా

హనుమాన్ చాలీసాను సాధారణంగా ఎక్కువమంది మంగళవారం   చదువుతారు. నిజానికి ఇది ప్రతిరోజూ చదవాల్సిందే. హనుమాన్ చాలీసా చదివే వారిలో భక్తితో పాటు ధైర్యం, బలం కూడా పెరుగుతుంది. హనుమంతుడు భూమికి అత్యంత దగ్గరగా ఉంటాడని నమ్ముతారు. ఎలాంటి ఒత్తిడి, భయాలు లేకుండా తగ్గిస్తుంది.మీ జీవితంలో ఏవైనా మార్పులను చూడాలనుకుంటే లేదా జీవితంలో అన్ని రకాల ఆందోళనల నుంచి విముక్తి పొందాలంటే సంపూర్ణమైన హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ  చదవాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి.హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఆపద సమయంలో రక్షణ దొరుకుతుందని మార్గదర్శకత్వం లభిస్తుందని ఎంతోమంది నమ్మకం. ఈ హనుమాన్ చాలీసా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. 

ఓం నమశ్శివాయ

శివునికి అంకితం చేసిన మరో శక్తివంతమైన మంత్రం ఓం నమశ్శివాయ. అంటే అర్థం ‘నేను శివునికి, అతని శక్తికి నమస్కరిస్తున్నాను’ అని అర్థం. దీన్ని జపించడం వల్ల భయాలు, ఒత్తిడి, ఆందోళన వంటివి తొలగిపోతాయి. మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో హృదయంతో జపించాలి.ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్ఛారణ వల్ల నాడులు పరిశుభ్రమై, మనసులో ప్రశాంతత నెల కుంటుందని పండితులు చెబుతారు. దీనిని పదేపదే ఉచ్ఛరించడం వల్ల మనిషిలో ఉండే తమో, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మిక వేత్తలు బోధిస్తున్నారు. ఒకసారి రెండుసార్లు కాదు ఎక్కువసార్లు జపించడం వల్ల ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు. లోతైన ధ్యాన స్థితిలో ఓం నమశివాయ పఠించినప్పుడు ఆ మంత్రంలో నిక్షిప్తమైన శక్తి, మనసును శుద్ధి చేస్తుంది. ఒత్తిడి ప్రేరేపిత లక్షణాలను తగ్గిస్తుంది.