పెద్దపల్లి బీజేపీలో భగ్గుమన్న విభేదాలు

పెద్దపల్లి బీజేపీలో భగ్గుమన్న విభేదాలు

పెద్దపల్లి బీజేపీలో విభేదాలు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాటా మాట పెరిగి ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారి తీసింది.. ఒకరిని ఒకరు తోసేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా నియమితులై మొదటిసారిగా పెద్దపల్లికి వస్తున్న చంద్రుపట్ల సునీల్ రెడ్డి కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డికి ఆహ్వానం లేదని గుజ్జుల వర్గం గొడవకు దిగారు.