క్రికెటర్ దుర్గాప్రసాద్ మృతి తీరని లోటు : ఎంపీ వంశీకృష్ణ

క్రికెటర్ దుర్గాప్రసాద్ మృతి తీరని లోటు : ఎంపీ వంశీకృష్ణ
  • నివాళుర్పించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • పలు బాధిత కుటుంబాలకు పరామర్శ


కోల్​బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: సీనియర్ ​క్రికెటర్​బింగి దుర్గాప్రసాద్​ అకాల మరణం క్రికెట్​కు తీరని లోటని, మంచి క్రికెటర్​ను కోల్పోయామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. బుధవారం రాత్రి మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్, బెల్లంపల్లి పట్టణాల్లో ఎంపీ పర్యటించారు. ఇటీవల చనిపోయిన పలువురు బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. రామకృష్ణాపూర్​పట్టణానికి చెందిన కాంగ్రెస్​ లీడర్​బింగి శివకిరణ్​ సొదరుడు సీనియర్​ క్రికెటర్, కోచ్​దుర్గాప్రసాద్ ఇటీవల గుండెపోటుతో చనిపోగా ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.

 కోల్​బెల్ట్​ ప్రాంతంలో క్రీడాభివృద్ధికి ఆయన ఎన్నో సేవలు చేశారని గుర్తుచేసుకున్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దుర్గాప్రసాద్​ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్​మాజీ ప్రజాప్రతినిధులు పూల్లూరి కల్యాణ్, సుధాకర్​ సోదరుల తల్లి భీమక్క, కాంగ్రెస్​ లీడర్​కట్ల రమేశ్​తల్లి లక్ష్మి, బెల్లంపల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ ​సీనియర్ లీడర్లు​మత్తమారి శ్రీనివాస్​ అత్త దాసరి అనసూర్యవతి,​ కన్నూరి వెంకటేశ్​ తండ్రి ఓదెలు ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబాలను ఎంపీ పరామర్శించారు. ఆయన వెంట స్థానిక లీడర్లు రఘునాథ్​ రెడ్డి, మత్తమారి సూరిబాబు, మునిమంద రమేశ్, గెల్లి జయరాజ్, పోలం సత్యనారాయణ, ఎ.రాజేశ్, ప్రేమ్​సాగర్, రాజలింగు, సతీశ్, లక్ష్మణ్, రమేశ్, రాజనర్సు, బాలరాం, అశోక్ గౌడ్ పాల్గొన్నారు.