- రాతపూర్వక హామీ కోసం పట్టుబట్టిన ఎంప్లాయీస్
మంచిర్యాల, వెలుగు: చెన్నూర్లో విద్యుత్ ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని, సిబ్బందిపై దాడి చేసిన టీఆర్ఎస్ కౌన్సిలర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గురువారం నుంచి మంచిర్యాల జిల్లావ్యాప్తంగా పెన్డౌన్, టూల్డౌన్ చేపడతామని ప్రకటించినప్పటికీ.. శుక్రవారం ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉండడంతో టూల్డౌన్ను రెండ్రోజులు వాయిదా వేశారు. గురువారం జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి 300 మందికిపైగా ఎంప్లాయీస్ ఎస్ఈ ఆఫీసుకు తరలివచ్చి పెన్డౌన్, రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ లీడర్లు మాట్లాడుతూ.. విద్యుత్ సిబ్బందిపై పెట్టిన తప్పుడు అట్రాసిటీ కేసుతో పాటు ఇతర కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై దాడి చేసిన మున్సిపల్కౌన్సిలర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, చెన్నూర్ సబ్స్టేషన్ స్థలాన్ని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కాపాడాలని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు.
కలెక్టర్, పోలీస్ కమిషనర్ను కలిసిన సీవీఓ
విద్యుత్ఉద్యోగుల ఆందోళనపై ఎన్పీడీసీఎల్చీఫ్విజిలెన్స్ఆఫీసర్(సీవీఓ) శర్మ స్పందించారు. ఎస్ఈ రమేష్బాబు తదితరులతో కలిసి రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి, మంచిర్యాల కలెక్టర్ భారతి హొళికేరిని కలిశారు. విద్యుత్ సిబ్బందిపై పెట్టిన తప్పుడు కేసుల గురించి వారి దృష్టికి తీసుకెళ్లి, కేసులు ఎత్తేయాలని కోరారు. అట్రాసిటీ కేసుపై మూడు రోజుల్లోగా జైపూర్ ఏసీపీతో ఎంక్వైరీ జరిపించి ఫాల్స్గా తేలితే ఎత్తేస్తామని సీపీ చంద్రశేఖర్రెడ్డి హామీనిచ్చినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఆయన జేఏసీ లీడర్లతో చెప్పగా, తమ డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇచ్చేంతవరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
చెన్నూర్ అంటేనే భయపడుతున్నరు
కౌన్సిలర్ల చేతిలో దాడికి గురైన సిబ్బంది అక్కడ పని చేయడానికి భయపడుతున్నారు. వారిని ట్రాన్స్ఫర్చేసి ఇతరులను నియమించాలని యూనియన్లీడర్లు సీవీఓ శర్మను కోరినట్టు తెలిసింది. దీంతో తామెక్కడ చెన్నూర్కు వెళ్లాల్సి వస్తుందోనని మిగతావారు మదనపడుతున్నారు. ఉద్యోగులతో లీడర్లు వ్యవహరిస్తున్న తీరుతో చెన్నూర్ అంటేనే
వణికిపోతున్నారు.