రుణమాఫీపై ప్రజల్లో సంతోషం: భట్టి

రుణమాఫీపై ప్రజల్లో సంతోషం: భట్టి
  • ప్రతిపక్షాలు హైదరాబాద్​లో కూర్చొని విమర్శలొద్దు
  • విప్లవాత్మకంగా సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ స్కూల్స్ తెస్తం

హైదరాబాద్, వెలుగు: రుణమాఫీపై ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారని.. దీనిపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూర్చుని విమర్శలు వద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమది ప్రజా ప్రభుత్వమని.. ప్రతి అంశంలో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, డే స్కూల్స్ కాకుండా సెమీ రెసిడెన్షియల్,  రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. 

ఇప్పుడున్న ప్రభుత్వ విద్య కంటే మెరుగైన విద్యను అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు. 10 గ్రామాలకు ఒకటి.. మండలానికి 3 చొప్పున ఈ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఒక్కో స్కూలు కోసం రూ.80 నుంచి రూ.100 కోట్లు ఖర్చు చేయబోతోందని వెల్లడించారు. కార్పొరేట్ స్కూల్స్ టైప్ ప్రభుత్వ బడులు రాబోతున్నాయని చెప్పారు. 

సెమీ రెసిడెన్షియల్​లో భాగంగా ట్రాన్స్​ పోర్ట్ కోసం స్కూల్ బస్సులు ఏర్పాటు చేస్తామని దీంతో ఉపాధి కూడా కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. బీఏసీలో బీఆర్ఎస్ నాయకుల పేర్లు మార్చుకున్నారని, అందుకే సమావేశం ఆలస్యం అయిందన్నారు. ఐఏఎస్ ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటా విషయంలో స్మితా సబర్వాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యాలు ఆమె వ్యక్తిగత పేర్కొన్నారు.